ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల మజారా బుద్దానగర్ గ్రామంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి సహకారంతో నాబార్డ్ ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో ఉన్న ప్రజలు, రైతులు అందరికి బ్యాంకు లలో ఇన్సూరెన్స్ గురించి, ప్రభుత్వ స్కీమ్స్ గాని, కళాకారులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని ప్రజలకు ఎమ్.వి రూరల్ ఫోల్క్ ఆర్ట్ ఆర్గనైజషన్ మహేష్ ఆధ్వర్యంలో వివరించారు. ఈ కార్యక్రమం రాయలసీమ గ్రామీణ బ్యాంకు మేనేజర్ & సీఈవో ఎస్.లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట స్టాఫ్ ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ టి.అశోక్, ఆర్గనైజషన్ చరణ్, రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News