ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వు ప్రాంతాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిలభారత పులుల గణన కార్యక్రమాన్ని 2026 సంవత్సరానికి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు మాట్లాడుతూ జాతీయస్థాయి కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులోని, ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఫెజ్ దశలో 600ల మైరా కెమెరా ట్రాపుల ద్వారా పులుల గణన ఘనంగాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. బ్లాక్ వన్ పరిధిలోని ,ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్ లలో ఈ గణన పనులను ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగిస్తున్నారని అఖిలభారత పులుల గణన కార్యక్రమం జాతీయ ప్రాముఖ్యత కలిగినందున శాస్త్రీయ గణన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలవకుండా ఉండేందుకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు, పెచ్చేరువు, నాగలూటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతించబడదని సూచించారు. ఈ కాలంలో భక్తులు దోర్నాల మార్గం ద్వారా ప్రయాణించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 8 నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులు యధావిధిగా అడవి మార్గం నుండి వెళ్లవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రజలు భక్తితోపాటు పర్యావరణ పరిరక్షణనపైన కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వన్యప్రాణులను సంరక్షించడం, రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ భవిత, ఐఎఫ్ఎస్సి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News