Wednesday, 29 July 2026 09:21:48 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

అఖిలభారత పులుల గణన జరుగుతున్నందున శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తులు ఈ సమాచారాన్ని తెలుసుకోండి

ఆత్మకూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్

Date : 08 January 2026 09:54 PM Views : 231

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వు ప్రాంతాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిలభారత పులుల గణన కార్యక్రమాన్ని 2026 సంవత్సరానికి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు మాట్లాడుతూ జాతీయస్థాయి కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులోని, ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఫెజ్ దశలో 600ల మైరా కెమెరా ట్రాపుల ద్వారా పులుల గణన ఘనంగాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. బ్లాక్ వన్ పరిధిలోని ,ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్ లలో ఈ గణన పనులను ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగిస్తున్నారని అఖిలభారత పులుల గణన కార్యక్రమం జాతీయ ప్రాముఖ్యత కలిగినందున శాస్త్రీయ గణన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలవకుండా ఉండేందుకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు, పెచ్చేరువు, నాగలూటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతించబడదని సూచించారు. ఈ కాలంలో భక్తులు దోర్నాల మార్గం ద్వారా ప్రయాణించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 8 నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులు యధావిధిగా అడవి మార్గం నుండి వెళ్లవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రజలు భక్తితోపాటు పర్యావరణ పరిరక్షణనపైన కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వన్యప్రాణులను సంరక్షించడం, రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ భవిత, ఐఎఫ్ఎస్సి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :