ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయము మీటింగ్ హాల్ నందు ఎంపీడీవో- పి.నాగేంద్రుడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.పవన్కుమార్, ఆత్మకూరు టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య ఆధ్వర్యంలో మండల స్థాయి టిబి ముక్తు పంచాయతీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధిగ్రస్తులకు క్షయ వ్యాధి మందుల పంపిణీ ఫుడ్ బాస్కెట్స్ మరియు ఐపిసిపి ఫాలో అప్ కుటుంబ స్క్రీనింగ్లు, వండర్ఫుల్ లిస్ట్ లోని వారందరికీ గ్రామంలోని క్షయ వ్యాధి స్క్రీనింగ్ చేసి క్షయ రహిత గ్రామముగా తీర్చిదిద్దుటలో సర్పంచ్, గ్రామ సెక్రెటరీ లు హెల్త్ వెల్నెస్ సెంటర్ లో పనిచేయుచున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆరోగ్య కార్యకర్త, ఆశ గ్రామంలోని అధికారులు అందరు కలిపి టీబి ముక్త్ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగేంద్రుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.పవన్ కుమార్ లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, మరియు కొట్టాల చెరువు ఎంపీహెచ్వో శ్రీనివాసులు, పీహెచ్ఎన్ భ్రమరాంబ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ధనలక్ష్మి, ఆరోగ్య పర్యవేక్షణ అధికారి రమణమ్మ, మండల స్థాయిలోని హెల్త్ వెల్నెస్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News