ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి సహకారంతో నాబార్డ్ ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో ఉన్న ప్రజలు, రైతులు అందరికి బ్యాంకులలో ఇన్సూరెన్స్ గురించి, ప్రభుత్వ స్కీమ్స్ గాని, కళాకారులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని ప్రజలకు ఎమ్.వి.రూరల్ ఫోల్క్ ఆర్ట్ ఆర్గనైజషన్ మహేష్ ఆధ్వర్యంలో ఆంద్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం మేనేజర్ & సీఈవో ఎస్.లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో ఆర్థిక అక్షరాస్యత మీద ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆంద్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం ప్రెసిడెంట్ సి.గోవిందు, టిడిపి నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, కేడీసీసీ బ్రాంచ్ ఆత్మకూరు సూపర్ వైజర్ సాయి కుమార్, ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ టి.అశోక్ కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News