ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం శాసనసబ్యులు బుడ్డా.రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం తెలుగుదేశం నాయకులు యుగందర్ రెడ్డి, ఆత్మకూరు సహకార పరపతి సంఘము చైర్మన్ ఆత్మకూరు షహబుద్దిన్ లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్- డి.విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, జ్ఞాపిక చేతికి అందించి ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మకూరు సహకార పరపతి సంఘం చైర్మన్ షహబుద్దీన్, టిడిపి నాయకుడు యుగంధర్ రెడ్డిలు రైతుల సమస్యలను దృష్టిలో వుంచుకొని, చిరు వ్యాపారస్తుల ఇబ్బందులు చూసి సహకార సంఘము నుండి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో శనివారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్- డి.విష్ణు వర్ధన్ రెడ్డి ని ఆత్మకూరు సహకార సంఘానికి పెట్టి లోన్స్ క్రింద కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరారు.
Admin
E Nivas News