ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇంచార్జీ మాండ్ర. శివానందా రెడ్డి 66 వ జన్మదినం సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆధ్వర్యంలో ముందస్తుగా ఆత్మకూరు మండలములోని, కరివేన గ్రామంలో ఉన్న ఎస్సార్బీసీ కాలనీ నందు గల మానవతా నిలయం( వృద్ధాశ్రమంలో) అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాములపాడు సబ్ ఇనస్పెక్టర్ పి.తిరుపాలు పాల్గొని, వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, పాములపాడు ఎస్ఐ పి.తిరుపాలు, తదితరులు మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందా రెడ్డి నందికొట్కూరు నియోజక వర్గంలో అభివృద్ధి కోసం పాటుపడే వారని, నియోజక వర్గ ప్రజలు శ్రేయస్సు కోరుకూని వీరు, కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నందికొట్కూరు ను నందనవనంగా మారుస్తున్న ఆయన మంచి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో పార్టీ పదవులు మరిన్ని అలంకరించి ప్రజలకు సేవచేయాలని, నియోజక వర్గ ప్రజలు నిండుమనసుతో ఆయనను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు రుద్రవరం షేక్.కరీం బాష, ఏబీఎన్ పాలెం టీడీపీ నాయకులు కాటేపోగు నాగ సురేష్, తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు విక్రమ్ గౌడ్, మిట్టకందాల నాయకులు లింగాల శివరాముడు, లింగాల అబ్రహం, శివ రాజు, లింగాల దేవ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News