ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పట్టణ పరిధిలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు 20. వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పి- సోమన్న, సీఐ- బిఆర్.కృష్ణయ్య లు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేటకు చెందిన నాయబ్ సయ్యద్ సజ్జత్ అలీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు వీఎల్టి సర్టిఫికెట్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ను సంప్రదించడం జరిగిందన్నారు. దీనికోసం మున్సిపల్ కమిషనర్ 20. వేలు ఖర్చు అవుతుందని తెలిపారని ఫిర్యాదుదారుడు నిన్నటి దినం అనగా బుధవారం ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించారని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి కి బిల్ కలెక్టర్ భాస్కర్ 20వేలు ఇవ్వాల్సిందిగా కమిషనర్ చెప్పినట్లు తెలిపారు. ఫిర్యాదు దారుని సమాచారం మేరకు బిల్ కలెక్టర్ రూ 20వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందన్నారు. బిల్ కలెక్టర్ ను విచారించగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకే 20వేల రూపాయలను తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Admin
E Nivas News