ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : నేడు నంద్యాల జిల్లా, మిడ్తూరు మండలంలోని, పలు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.కృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పిఆర్సి గడువు ముగిసిన, ఇంత వరకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయపోవడం శోచనీయం అని పేర్కొన్నారు, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల కాలం పూర్తి అయ్యిందని ఇకనైనా పి ఆర్ సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు, అంతవరకు 30% మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలని అని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2018 జూలై, 2019 జనవరి డిఎ అరీయర్స్ చాలా మందికి 1, 2, 3 విడతలు మాత్రమే చెల్లించారని అందరికీ అన్ని విడతల డిఎ బకాయిలు చెల్లించాలి అని అన్నారు, ఎంటిఎస్ ఉపాధ్యాయులను రెగ్యులైజ్ చేయాలి, సిఆర్ఎంటి, ఎంఐఎస్, తదితర ఎం ఆర్ సి సిబ్బంది జీతాలు పెంచాలని కోరారు. 2011 కంటే ముందు నియమింపబడ్డ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆ విధంగా విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె.మధుసూదన్ రావు, డి.జాకీర్, కె.శ్రీనివాసులు, మల్లయ్య, పి.రవికుమార్, ఎం.మధుసూదన్ రావు, జిల్లా & మండల బాధ్యులు నాగరాజు, జంగ్లిసాహేబ్, రాము, మాబాషా తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News