Tuesday, 28 July 2026 08:27:50 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రైతు సంఘాల విన్నపం

Date : 22 July 2026 10:44 PM Views : 38

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భారత ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ దీనిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు పాములపాడు డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబుకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు కే. నాగేశ్వర్ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు డి.స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య, కె.ఏసేపు, రైతు సంఘం నాయకులు బాల యేసు, వెంకటేశ్వర్లు, రంగస్వామి తదితరులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే మన రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. డా॥ స్వామినాథన్ కమిషన్ సూచన సీ2+50 సూత్రం అమలు చేయబడినందున, మన రైతాంగం ఏటా 3 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి, పొగాకు, టమోటా, మామిడి, కోకో, రొయ్యలు తదితర పంటలు కనీస మద్దతు ధరలు కూడా లేక, కొనే నాధుడు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ స్థితిలో అమెరికా నుండి దిగిమతులు వచ్చిపడితే మన రైతాంగం పూర్తిగా నష్టపోతారన్నారు. కావున స్వేచ్ఛా -వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంతకం చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతున్నాం అన్నారు అన్నారు. గతంలో ఎస్.కె.ఎమ్. నాయకత్వానికి హామీ ఇచ్చిన విధంగా అన్ని పంటలకు సీ2+50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల వ్యవసాయ, కార్మికుల రుణాలు ఒక్కసారి రద్దు చేయించాలని కోరుతున్నామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :