ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భారత ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ దీనిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు పాములపాడు డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబుకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు కే. నాగేశ్వర్ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు డి.స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య, కె.ఏసేపు, రైతు సంఘం నాయకులు బాల యేసు, వెంకటేశ్వర్లు, రంగస్వామి తదితరులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే మన రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. డా॥ స్వామినాథన్ కమిషన్ సూచన సీ2+50 సూత్రం అమలు చేయబడినందున, మన రైతాంగం ఏటా 3 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి, పొగాకు, టమోటా, మామిడి, కోకో, రొయ్యలు తదితర పంటలు కనీస మద్దతు ధరలు కూడా లేక, కొనే నాధుడు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ స్థితిలో అమెరికా నుండి దిగిమతులు వచ్చిపడితే మన రైతాంగం పూర్తిగా నష్టపోతారన్నారు. కావున స్వేచ్ఛా -వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంతకం చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతున్నాం అన్నారు అన్నారు. గతంలో ఎస్.కె.ఎమ్. నాయకత్వానికి హామీ ఇచ్చిన విధంగా అన్ని పంటలకు సీ2+50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల వ్యవసాయ, కార్మికుల రుణాలు ఒక్కసారి రద్దు చేయించాలని కోరుతున్నామన్నారు.
Admin
E Nivas News