ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న"రెండేళ్ల సుపరిపాలన - అభివృద్ధి, సంక్షేమం"అనే కార్యక్రమం సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ లోని 8 వ వార్డు నందు టిడిపి నాయకులతో, కార్యకర్తలతో కలిసి నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొని, ఇంటింటికి తిరుగుతూ ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి మరియు ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్, వార్డు అధ్యక్షులు విఎస్.మున్నా, బూతు ఇంచార్జ్ లు అన్వర్ భాష, మహబూబ్ బాషా, జలీల్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు విఎస్ .ఖలీల్, ఇర్ఫాన్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News