ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు నవంబర్ నెలలో మెంథా తుఫాను వర్షాలకు వరదరాజ స్వామి ప్రాజెక్టు నుండి విడుదలైన వరద నీటికి గురై పాములపాడు మండలంలోని, ఇస్కాల గ్రామ భవనాశి వాగు పరివాహక ప్రాంత రైతుల పంటలు మునిగి తీవ్ర నష్టం వాటిలిందని, ఈ నష్టాన్ని అంచనా వేయడానికి, దీనికి గల కారణాలను పరిశీలించడానికి ఆర్డిఓ- డి.నాగజ్యోతి(చైర్మన్) ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, తదితర అధికారులతో కూడిన జాయింట్ ఫీల్డ్ కమిటీ మంగళవారం ఇస్కాల గ్రామ రైతుల పంట భూములు, భవనాశి వాగు, వి ఆర్ ఎస్ పి ప్రాజెక్టు లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ ఫీల్డ్ కమిటీ పరిశీలనలో భవనాశి వాగు పూడికతో మూసుకొని పోయిందని, దీని కారణంగా వరద నీరు ఉప్పొంగి రైతుల పంట పొలాలను ముంచి వేయడం జరిగిందన్నారు. కనుక ఈ భవనాసి వాగును విస్తీర్ణం చేస్తేనే రైతుల పంట పొలాలకు రక్షణ తెలియజేశారు. ఈ పరిశీలించిన నివేదికను జిల్లా కలెక్టర్ కి పంపుతున్నట్టు తెలియజేశారు. ఈ జాయింట్ ఫీల్డ్ కమిటీలో చైర్మన్ గా ఆర్డీవో-డి.నాగజ్యోతి, కమిటీ సభ్యులుగా నంద్యాల డీఏవో ఎన్.వెంకటేశ్వర్లు, తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఏడిఏ- కే.హేమలత, ఏవో- ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఈఈ- పిబిఎం. కృష్ణారెడ్డి, వీఆర్పీ లు -పి.శ్రీనివాసరావు, బి.అయ్యప్ప పి.వెంకటరామిరెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈఈ- ఎస్.వెంకటేశ్వర ప్రసాద్, డిఈ- బి.మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్- డి.ఖాజాబీ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ- ఎస్.సువచ్చల, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News