Tuesday, 28 July 2026 07:07:00 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

రాజ్యాంగ సమానత్వం -- ప్రజాస్వామ్య పురోగతి

డాక్టర్ బత్తుల సంజీవరాయుడు(జాతీయ బీసీల కార్యదర్శి)

Date : 23 May 2026 10:20 PM Views : 91

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లాలోని, సునయన ఆడిటోరియంలో శ్రీ రాజీవ్ రంజన్ మిషన్ మిశ్రా బీసీ కమిషన్ వారు గ్రామీణ ,పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లపై అధ్యయన మరియు వినతులు స్వీకరించడం జరిగింది. 138 బీసీ కులాల సంక్షేమం , అభివృద్ధి రిజర్వేషన్లపై జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మెమోరాండం కమీషన్ ప్రతినిధి రాజీవ్ రంజాన్ మిశ్రాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు మాట్లాడుతూ దేశ జనాభాలో బిసి, ఓబీసీ వర్గాలు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ మాకు సంబంధించిన 138 బీసీ కులాల ఖచ్చితమైన గణాంకాలు లేవు. విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి వంటి రకరకాల రంగాలలో మాకు ఇవ్వాల్సిన న్యాయపరమైన వాటా నిర్ణయించటానికి గణాంకాలు తప్పక అవసరం ఉందని. కుల గణన ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్థితిగతులు , అవసరాలు , సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పథకాలు , ప్రాజెక్టులు మొదలగునవి రూపొందించవచ్చు అన్నారు. ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలి మెట్టు. భారత రాజ్యాంగం 15(4 ) 16( 4), 340 ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించుటకు ప్రభుత్వం అధికారం కల్పించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల డిమాండ్లు విదేశాలలో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనీ, 138 బీసీ కులాల సమగ్ర కుల గణన చేయాలి కుల వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ అధునాతన పనిముట్లు మంజూరు చేయాలనీ, సుస్థిర ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ల ద్వారా అన్ని రకాల పథకాలు ప్రభుత్వం చేపట్టాలనీ, ద్వారా బీసీ మహిళలకు కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గ్రామాలలో పట్టణాలలో 75% సబ్సిడీతో ఆర్థిక సాయం చేయాలనీ, రాష్ట్రంలో బీసీల సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెరలు పూర్తిగా ఆర్థికంగా , సామాజికంగా రాజకీయంగా ఏమాత్రం ప్రాధాన్యత రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఇవ్వటం లేదని కావున కమిషన్ అది గుర్తించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని , కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కల్పిస్తూ 75 శాతాన్ని సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తే ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశం ఉంటుందని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల కమిషన్ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిద్దె శ్రీనివాసులు , బిఎస్ఎన్ఎల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :