ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లాలోని, సునయన ఆడిటోరియంలో శ్రీ రాజీవ్ రంజన్ మిషన్ మిశ్రా బీసీ కమిషన్ వారు గ్రామీణ ,పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లపై అధ్యయన మరియు వినతులు స్వీకరించడం జరిగింది. 138 బీసీ కులాల సంక్షేమం , అభివృద్ధి రిజర్వేషన్లపై జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మెమోరాండం కమీషన్ ప్రతినిధి రాజీవ్ రంజాన్ మిశ్రాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు మాట్లాడుతూ దేశ జనాభాలో బిసి, ఓబీసీ వర్గాలు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ మాకు సంబంధించిన 138 బీసీ కులాల ఖచ్చితమైన గణాంకాలు లేవు. విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి వంటి రకరకాల రంగాలలో మాకు ఇవ్వాల్సిన న్యాయపరమైన వాటా నిర్ణయించటానికి గణాంకాలు తప్పక అవసరం ఉందని. కుల గణన ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్థితిగతులు , అవసరాలు , సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పథకాలు , ప్రాజెక్టులు మొదలగునవి రూపొందించవచ్చు అన్నారు. ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలి మెట్టు. భారత రాజ్యాంగం 15(4 ) 16( 4), 340 ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించుటకు ప్రభుత్వం అధికారం కల్పించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల డిమాండ్లు విదేశాలలో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనీ, 138 బీసీ కులాల సమగ్ర కుల గణన చేయాలి కుల వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ అధునాతన పనిముట్లు మంజూరు చేయాలనీ, సుస్థిర ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ల ద్వారా అన్ని రకాల పథకాలు ప్రభుత్వం చేపట్టాలనీ, ద్వారా బీసీ మహిళలకు కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గ్రామాలలో పట్టణాలలో 75% సబ్సిడీతో ఆర్థిక సాయం చేయాలనీ, రాష్ట్రంలో బీసీల సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెరలు పూర్తిగా ఆర్థికంగా , సామాజికంగా రాజకీయంగా ఏమాత్రం ప్రాధాన్యత రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఇవ్వటం లేదని కావున కమిషన్ అది గుర్తించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని , కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కల్పిస్తూ 75 శాతాన్ని సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తే ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశం ఉంటుందని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల కమిషన్ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిద్దె శ్రీనివాసులు , బిఎస్ఎన్ఎల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News