Saturday, 13 June 2026 01:11:06 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

తంగేడంచ స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 27 January 2026 08:03 AM Views : 136

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, తంగేడంచ స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద తంగేడంచ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఈ.కరుణాకర్ రెడ్డి హాజరై అయ్యారు. తంగేడంచ స్వర్ణ సచివాలయం పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ స్వామి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి అనేక మహనీయుల త్యాగాలను నేటి తరం వారు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని,విద్యార్థులు మరియు పెద్దలు ప్రతి ఒక్క పౌరులు,భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన భారతదేశ ప్రభుత్వం ఆమోదించిందని భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం 12 ఆర్టికల్స్ను తయారుచేసి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం 18 భాషలను గుర్తించి హక్కులను కలిగి ఉన్న భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండాలని విద్యతోపాటు మానవతా విలువలు తెలుసుకోవాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజులు పట్టిందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్వహస్తాలతో రచించారని విద్యార్థులకు, పెద్దలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటునే తమ విధులను నిర్వర్తించాలని ఇక్కడికి వచ్చిన వారందరికీ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని తెలుపడం జరిగింది. దేశ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాలను గ్రామస్థులకు తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషి ఫలితమే నేడు ఈ రిపబ్లిక్ డే అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అలాగే సంపన్నులైన, ఉన్నతస్థానములో అయినా కానీ ఒకే న్యాయం జరిగే విధంగా మన రాజ్యాంగం పని చేస్తుందని అన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ వెంకటేశ్వర్లు, సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం శ్వేత, అగ్రికల్చర్ జి.అసిస్టెంట్ ప్రసన్న, వెల్ఫర్ అసిస్టెంట్ సాయి కిరణ్, ఫీచరీ అసిస్టెంట్ హోనోకు, సర్వేయర్ తరుణ్ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ మంజుల, అంగన్వాడీ వర్కర్లు పుష్పవతమ్మ, పుష్ప, మరియు ఆశలు రాములమ్మ, శ్యామలమ్మ, స్వచ్ఛ భారత్ అంబాసిడర్స్, నీటి సరఫరా నర్రా శ్రీనివాసులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :