Wednesday, 29 July 2026 01:41:59 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

తంగేడంచ స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 27 January 2026 08:03 AM Views : 175

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, తంగేడంచ స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద తంగేడంచ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఈ.కరుణాకర్ రెడ్డి హాజరై అయ్యారు. తంగేడంచ స్వర్ణ సచివాలయం పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ స్వామి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి అనేక మహనీయుల త్యాగాలను నేటి తరం వారు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని,విద్యార్థులు మరియు పెద్దలు ప్రతి ఒక్క పౌరులు,భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన భారతదేశ ప్రభుత్వం ఆమోదించిందని భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం 12 ఆర్టికల్స్ను తయారుచేసి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం 18 భాషలను గుర్తించి హక్కులను కలిగి ఉన్న భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండాలని విద్యతోపాటు మానవతా విలువలు తెలుసుకోవాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజులు పట్టిందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్వహస్తాలతో రచించారని విద్యార్థులకు, పెద్దలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటునే తమ విధులను నిర్వర్తించాలని ఇక్కడికి వచ్చిన వారందరికీ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని తెలుపడం జరిగింది. దేశ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాలను గ్రామస్థులకు తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషి ఫలితమే నేడు ఈ రిపబ్లిక్ డే అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అలాగే సంపన్నులైన, ఉన్నతస్థానములో అయినా కానీ ఒకే న్యాయం జరిగే విధంగా మన రాజ్యాంగం పని చేస్తుందని అన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ వెంకటేశ్వర్లు, సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం శ్వేత, అగ్రికల్చర్ జి.అసిస్టెంట్ ప్రసన్న, వెల్ఫర్ అసిస్టెంట్ సాయి కిరణ్, ఫీచరీ అసిస్టెంట్ హోనోకు, సర్వేయర్ తరుణ్ కుమార్, డిజిటల్ అసిస్టెంట్ మంజుల, అంగన్వాడీ వర్కర్లు పుష్పవతమ్మ, పుష్ప, మరియు ఆశలు రాములమ్మ, శ్యామలమ్మ, స్వచ్ఛ భారత్ అంబాసిడర్స్, నీటి సరఫరా నర్రా శ్రీనివాసులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :