ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : భారతీయ జనతా పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావడం అభినందనీయమని బీజేపీ పాములపాడు మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు పాములపాడు మండల బీజేపీ కార్యాలయంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇన్చార్జి మల్లెల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పలువురు యువకులు బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. సరల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న డిజిటల్ పరీక్షలు, వాటి ప్రాముఖ్యతపై కార్యకర్తలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలను ప్రజలకు చేరవేసి, వాటి ఫలాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, యువతను అధిక సంఖ్యలో పార్టీలోకి తీసుకురావాలని నాయకులు సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, ప్రవీణ్ కుమార్, నాయకులు బాలస్వామి, రామకృష్ణ, చంద్రారెడ్డి, రుద్రశేఖర్, శివకుమార్, ఉమాశంకర్, తరాల రఘురాం, సూర్యం, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News