Wednesday, 29 July 2026 12:06:15 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఇష్ట‌ప‌డి చ‌దువుతూ ఉన్న‌త‌ స్థానాల‌కు ఎద‌గండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌

Date : 08 February 2026 07:57 AM Views : 89

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అబ్దుల్ క‌లాం వంటి మహనీయుల స్ఫూర్తి పథంలో నడుచుకుంటూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆయన విద్యార్థుల‌కు సూచించారు. శ‌నివారం కొండపల్లి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల 36వ వార్షికోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌, మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌తో క‌లిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి పాఠశాల మైదానంలో విద్యార్థినుల ప్రత్యేక ప‌రేడ్ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ప్ర‌పంచంలో స‌గ‌ర్వంగా నిలిచిందంటే అందుకు అబ్దుల్ క‌లాం వంటి మ‌హ‌నీయుల కృషే కార‌ణ‌మ‌న్నారు. స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా వెన‌క్కు త‌గ్గ‌కూడ‌ద‌న్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాట‌ల‌ను స‌రైన విధంగా అర్థం చేసుకుంటూ ముంద‌డుగు వేయాల‌న్నారు. విద్యార్థి ద‌శ‌లో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రేర‌ణ కార‌ణంగానే ఈ స్థాయిలో నిలిచాన‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప‌టిష్టంగా అమ‌లుచేస్తోంద‌ని దీన్ని స‌ద్వినియోగం చేసుకొని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు సాధించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకొనే ఎంద‌రో గొప్ప‌వార‌య్యార‌ని విద్యార్థులు ప‌ట్టుద‌ల‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చ‌దువుకొని జీవితంలో ఉన్న‌త‌స్థానాల‌కు ఎద‌గాల‌ని మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ అన్నారు. మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే చ‌దువుకొని ఈస్థాయికి చేరుకున్నార‌న్నారు. ఇలాంటివారిని స్ఫూర్తిగా తీసుకొని క‌ష్ట‌ప‌డి చ‌దివి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు తెచ్చుకోవాల‌ని సూచించారు. కొండ‌ప‌ల్లి బాలిక‌ల జెడ్‌పీ హైస్కూల్ అభివృద్ధిపై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తో పాటు మైదానం అభివృద్ధికీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు ఉప‌కార‌వేత‌నాలు కూడా అందిస్తామ‌ని వెల్ల‌డించారు. చిన్నారులు విద్య‌తో పాటు నైతిక విలువ‌లు పెంపొందించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఈ దిశ‌గా విద్యాబోధ‌న జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న పుస్త‌కాలు, యూనిఫామ్‌, నాణ్య‌మైన మధ్యాహ్న భోజ‌నం, మౌలిక వ‌స‌తులను స‌ద్వినియోగం చేసుకొని బాగా చ‌దువుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ చిన్నారుల‌కు సూచించారు. విద్యార్థినుల మార్చ్‌ ఫాస్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌జా ప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. విద్యార్థినులకు శాస‌న‌స‌భ్యులు సమకూర్చిన క్రీడా సామగ్రిని పరిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ఛైర్మ‌న్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జ్యోత్స్న‌, హెచ్ఎం-హేమ‌ల‌త‌, స్థానిక పెద్ద‌లు ఎ.రామ‌మోహ‌న‌రావు (గాంధీ), స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఎస్ఎంసీ ప్ర‌తినిధులు, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :