Wednesday, 29 July 2026 06:28:21 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి

Date : 26 November 2025 11:22 PM Views : 262

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడు మండల కేంద్రంలో జనవరి- 9, 10వ తేదీలలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయడానికి సంఘం ఆధ్వర్యంలో ఆహ్వాన సంఘ సమావేశం మండల కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శివ నాగరాణి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కోసం అనేక పోరాటాలు చేసి వారికోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇతర స్థానిక సమస్యలు పోరాడి సాధించడం జరిగింది. నేటికీ పాలక ప్రభుత్వాలు కూలీల పట్ల అనేక రకాలుగా వివక్ష చూపుతూ, పేదలకు ఇచ్చిన భూములను లాక్కుంటూ అలాగే ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ అనేక ఇబ్బందులు పెడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన విధానాలను అనుసరిస్తుందని వాటిని వెంటనే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ పరిశ్రమల కోసం పేదల భూములు లాక్కుంటుందని వారికి తగిన నష్టపరిహారం కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రాబోవు కాలంలో పేదల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభలో జయప్రదం కోసం ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా ఆర్.ఎస్.గోపాల్, అధ్యక్షుడుగా కోట్ల.చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులుగా బత్తుల.సంజీవరాయుడు, ఎస్.షేక్షాఅలి, వీరితోపాటు 35 మందితో కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్ ,ఎం.సుధాకర్, బాలయ్య ,స్వాములు, డేవిడ్, ఓబులేసు, ఈశ్వరమ్మ, మధు శేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు- డి.స్వామన్న, రజక వృత్తి సంఘం సి.వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు ఏ.రణదీర్, రామ నాయక్, శివ లక్ష్మమ్మ, కె వి పి ఎస్ జిల్లా నాయకులు జయరాణి, మహిళా సంఘం నాయకురాలు రవణమ్మ ,అలాగే మండల పరిధిలోని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: