Tuesday, 28 July 2026 11:48:10 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

జనవరి-4న కర్నూలులో జరిగే వడ్డెర హక్కుల సాధన సదస్సును విజయవంతం చేయండి

ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య

Date : 28 December 2025 09:05 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : జనవరి 4న కర్నూలు నగరంలోని , జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే వడ్డెర హక్కుల సాధన సదస్సును విజయవంతం చేయాలని ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని రైతునగరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య మాట్లాడుతూ వడ్డెరులను ఎస్టీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని అన్నారు. గత ఎన్నికల ముందు వడ్డెరులకు ఇచ్చిన హమీలను కూటమి ప్రభుత్వం నేరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు,పాములపాడు, వెలుగోడు,శిరివెళ్ల, గోస్పాడు మండలాల్లో సదస్సుకు వడ్డెరులు తరలిరావాలని ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చే బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్ కు పంపాలని కోరారు.వడ్డెరుల డిమాండ్ల సాధనకై నిర్వహించే సదస్సుకు వేలాదిగా వడ్డెరులు తరలిరావాలని సూచించారు. వడ్డెరుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. వడ్డెరులు ఐక్యమత్యంతో మెలగాలని సూచించారు. వడ్డెరులకు మైనింగ్ పై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాయల్టీ నుంచి వడ్డెరులకు మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: