Saturday, 13 June 2026 01:11:12 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

సరైన అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం...! అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబ‌ర్ క్రైమ్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్‌

Date : 20 January 2026 07:47 PM Views : 149

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ప్ర‌జ‌ల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌రైన అవ‌గాహ‌న ద్వారానే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు క‌ళ్లెం వేయొచ్చ‌ని విజ‌య‌వాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని, ఏపీ స్టేట్ గెస్ట్ హౌజ్ ప్రాంగ‌ణంలోని జిల్లా స‌మాచార, పౌర సంబంధాల శాఖ కార్యాల‌య స‌మావేశ మందిరంలో సైబ‌ర్ నేరాల‌పై వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, సిబ్బందికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో ఒక‌వైపు మ‌నం ఎన్నో సౌక‌ర్యాలు పొందుతున్నాం.. ఇదే స‌మ‌యంలో మ‌రోవైపు సాంకేతిక‌త ఆస‌రాతో సైబ‌ర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నార‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షితంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించే విధానాలపై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఆశ‌, భ‌యం.. ఈ రెండే సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకునేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాలకు సంబంధించిన ఉదాహరణలు, ఇప్పటికే నమోదైన కేసులతో సహా వివరించి, ఎలా మోసాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేశారు. డిజిట‌ల్ అరెస్టులు, ఏసీబీ అధికారుల‌మంటూ వ‌చ్చే ఫేక్ కాల్స్ త‌దిత‌రాల‌పైనా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఒక‌వేళ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల‌ని, గోల్డెన్ అవ‌ర్‌లో టోల్ ఫ్రీ నంబర్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. https://www.ntrpolice.in/ వెబ్సైట్ లోని స‌మాచారాన్ని కూడా పొంది, స‌రైన అవ‌గాహ‌న‌తో సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి ర‌క్ష‌ణ పొందాల‌న్నారు. సైబర్ నేరాలపై కేవలం వ్యక్తిగతంగా కాకుండా, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులతో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఐ- ఎన్‌.శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో ఏఎస్ఐ బీడ‌బ్ల్యూ దాస‌న్‌, డీఐపీఆర్‌వో కేవీ.ర‌మ‌ణ‌రావు, అడిష‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, ఏవీ సూప‌ర్‌వైజ‌ర్ వీవీ.ప్ర‌సాద్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల డీసీవో ఎ.ముర‌ళీకృష్ణ‌, భూ సేక‌ర‌ణ కోర్టు రిజిస్ట్రార్ ఎన్‌.సూర్య‌నారాయ‌ణ‌, ఐ అండ్ పీఆర్‌, డా.ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్ర‌స్టు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :