Monday, 14 September 2026 06:32:16 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సరైన అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం...! అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబ‌ర్ క్రైమ్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్‌

Date : 20 January 2026 07:47 PM Views : 232

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ప్ర‌జ‌ల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌రైన అవ‌గాహ‌న ద్వారానే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు క‌ళ్లెం వేయొచ్చ‌ని విజ‌య‌వాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని, ఏపీ స్టేట్ గెస్ట్ హౌజ్ ప్రాంగ‌ణంలోని జిల్లా స‌మాచార, పౌర సంబంధాల శాఖ కార్యాల‌య స‌మావేశ మందిరంలో సైబ‌ర్ నేరాల‌పై వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, సిబ్బందికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో ఒక‌వైపు మ‌నం ఎన్నో సౌక‌ర్యాలు పొందుతున్నాం.. ఇదే స‌మ‌యంలో మ‌రోవైపు సాంకేతిక‌త ఆస‌రాతో సైబ‌ర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నార‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షితంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించే విధానాలపై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఆశ‌, భ‌యం.. ఈ రెండే సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకునేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాలకు సంబంధించిన ఉదాహరణలు, ఇప్పటికే నమోదైన కేసులతో సహా వివరించి, ఎలా మోసాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేశారు. డిజిట‌ల్ అరెస్టులు, ఏసీబీ అధికారుల‌మంటూ వ‌చ్చే ఫేక్ కాల్స్ త‌దిత‌రాల‌పైనా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఒక‌వేళ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల‌ని, గోల్డెన్ అవ‌ర్‌లో టోల్ ఫ్రీ నంబర్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. https://www.ntrpolice.in/ వెబ్సైట్ లోని స‌మాచారాన్ని కూడా పొంది, స‌రైన అవ‌గాహ‌న‌తో సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి ర‌క్ష‌ణ పొందాల‌న్నారు. సైబర్ నేరాలపై కేవలం వ్యక్తిగతంగా కాకుండా, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులతో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఐ- ఎన్‌.శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో ఏఎస్ఐ బీడ‌బ్ల్యూ దాస‌న్‌, డీఐపీఆర్‌వో కేవీ.ర‌మ‌ణ‌రావు, అడిష‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, ఏవీ సూప‌ర్‌వైజ‌ర్ వీవీ.ప్ర‌సాద్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల డీసీవో ఎ.ముర‌ళీకృష్ణ‌, భూ సేక‌ర‌ణ కోర్టు రిజిస్ట్రార్ ఎన్‌.సూర్య‌నారాయ‌ణ‌, ఐ అండ్ పీఆర్‌, డా.ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్ర‌స్టు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :