Wednesday, 29 July 2026 11:27:45 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సరైన అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం...! అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబ‌ర్ క్రైమ్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్‌

Date : 20 January 2026 07:47 PM Views : 175

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ప్ర‌జ‌ల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌రైన అవ‌గాహ‌న ద్వారానే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు క‌ళ్లెం వేయొచ్చ‌ని విజ‌య‌వాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని, ఏపీ స్టేట్ గెస్ట్ హౌజ్ ప్రాంగ‌ణంలోని జిల్లా స‌మాచార, పౌర సంబంధాల శాఖ కార్యాల‌య స‌మావేశ మందిరంలో సైబ‌ర్ నేరాల‌పై వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, సిబ్బందికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో ఒక‌వైపు మ‌నం ఎన్నో సౌక‌ర్యాలు పొందుతున్నాం.. ఇదే స‌మ‌యంలో మ‌రోవైపు సాంకేతిక‌త ఆస‌రాతో సైబ‌ర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నార‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షితంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించే విధానాలపై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఆశ‌, భ‌యం.. ఈ రెండే సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకునేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాలకు సంబంధించిన ఉదాహరణలు, ఇప్పటికే నమోదైన కేసులతో సహా వివరించి, ఎలా మోసాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేశారు. డిజిట‌ల్ అరెస్టులు, ఏసీబీ అధికారుల‌మంటూ వ‌చ్చే ఫేక్ కాల్స్ త‌దిత‌రాల‌పైనా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఒక‌వేళ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల‌ని, గోల్డెన్ అవ‌ర్‌లో టోల్ ఫ్రీ నంబర్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. https://www.ntrpolice.in/ వెబ్సైట్ లోని స‌మాచారాన్ని కూడా పొంది, స‌రైన అవ‌గాహ‌న‌తో సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి ర‌క్ష‌ణ పొందాల‌న్నారు. సైబర్ నేరాలపై కేవలం వ్యక్తిగతంగా కాకుండా, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులతో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఐ- ఎన్‌.శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో ఏఎస్ఐ బీడ‌బ్ల్యూ దాస‌న్‌, డీఐపీఆర్‌వో కేవీ.ర‌మ‌ణ‌రావు, అడిష‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, ఏవీ సూప‌ర్‌వైజ‌ర్ వీవీ.ప్ర‌సాద్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల డీసీవో ఎ.ముర‌ళీకృష్ణ‌, భూ సేక‌ర‌ణ కోర్టు రిజిస్ట్రార్ ఎన్‌.సూర్య‌నారాయ‌ణ‌, ఐ అండ్ పీఆర్‌, డా.ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్ర‌స్టు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: