ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : ఓర్వకల్ మండలంలోని, బొడ్డువాను పల్లె గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేను ఈరోజు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని గ్రామంలో బిఎల్వోలతో కలిసి ఇంటింటి ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో పూర్తి చేసిన ఎస్ఐఆర్ ఫారాలను పరిశీలించడం జరిగింది. ఓర్వకల్ మండలంలో ఎవరి ఓట్లు కూడా మిస్ కాకుండా చూడాలని బిఎల్ఓలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ రమేష్, గ్రామ వీఆర్ఏ మద్దిలేటి, బూత్ కొ కన్వీనర్ రవికుమార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News