ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామ పొలిమేరలో ఉన్న సర్వే నంబర్ -203, 211, దారి విషయంలో గ్రామ ప్రజలకు మరియు వడ్డే శివుడు, వడ్డే శివశంకర్, వడ్డే హానుమక్క, వడ్డే మల్లేశ్వరయ్య, శివమ్మ , సునీత లకు వివాదం ఏర్పడిందని ఈ విషయంలో గత 30 సంవత్సరముల నుండి గ్రామ ప్రజలు ఏ విధంగా దారి వెంట పోతున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా పోవచ్చు అని ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ జాతీయ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు తో కలిసి పాములపాడు మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ కు, డిప్యూటీ తహాసిల్దార్ పఠాన్ బాబు కు, ఆర్ఐ- డి.ఖాజాబి లకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరియు రెవెన్యూ కార్యాలయంలో ఉన్న పాత , కొత్త రికార్డుల ఆధారంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని జాతీయ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తహసిల్దార్ ను కోరారు.
Admin
E Nivas News