ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ (సైన్స్) గా పనిచేస్తూ, 30-06-2026 న పదవీ విరమణ చేసి, నేడు ఘనంగా సన్మానం పొందటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.కరుణానిధి మూర్తి, పాములపాడు మండల విద్యాధికారి డి.బాలాజీ నాయక్, ఎంఈఓ-2 బి.గోపాల్, పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, డైట్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ సురేష్ కుమార్, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్.ఇబ్రహీం, ఎస్.వి. రామిరెడ్డి, మధుసూదన్ రావు, పూర్వపు ఆత్మకూరు మండల విద్యాధికారి జానకిరామ్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు రాజేశ్వరమ్మ , వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. దామరేకుల రవి 30 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, పి ఆర్ టి యు సంఘ నాయకుడిగా ఆయన సేవలు, ఆయన విద్యార్థులకు అందించిన సహాయం ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయనను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పి ఆర్ టి యు నాయకులు, ఉపాధ్యాయులు, బంధు మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు సుమియన్, పాములపాడు మండల అధ్యక్షడు ఎ.సాంబ శివుడు, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్.మొయినుద్దీన్, పి ఆర్ టి యు జిల్లా నాయకులు వి. వెంకటసుబ్బయ్య, రామేశ్వర రెడ్డి, మహేశ్వర రావు, మరియు పాములపాడు జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ కలబండి.రాజశేఖర్, హైమావతి, శారద, మనోరంజని, స్వామి శేఖర్, దామరేకుల రవి, సుబ్బనాయక్, రాంప్రసాద్, నజీర్ భాష, శ్రీనివాసులు, ఖాజా హుస్సేన్, ద్రాక్షాయని బాయి, సుహాసిని, చిన్న భారతి, శివ నాగలక్ష్మి, జయలత, విజయబాబు, ఏ.సుధాకర్, మల్లిక, రవీంద్ర నాయుడు, రమణి బాయి, మురళి రంగారెడ్డి, రామకృష్ణ, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్, రామమూర్తి, మరియు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News