ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు గునుపాటి భాస్కర్, ఆత్మకూరు అర్బన్ ,రూరల్ అధ్యక్షులు వేణుగోపాల్ , రవీంద్ర బాబు తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దిన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు శంకర్, దినకర్ రావు తోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. *ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* నందు శ్రీశైలం నియోజకవర్గ నాయకులు వై.యుగంధర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్ధిన్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. వీరి వెంట డైరెక్టర్ ప్రవీణ్, రైతులు వీరారెడ్డి, శంకర్ రెడ్డి, శంషుద్దీన్ , ఖాజామియా, సిబ్బంది రియాజ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా *ఆత్మకూరు బాలికల ఉన్నత పాఠశాల* నందు విద్యా కమిటీ చైర్మన్ ఖాజావలి, ప్రధాన ఉపాధ్యాయురాలు జి.ఉమారాణి, సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మరియు వేణుగోపాల్ తో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు, స్థానిక నాయకులు అమృల్లా, శ్రీను, అబ్దుల్ రజాక్, మొహమ్మద్, మాభాష తదితరులు పాల్గొన్నారు. *ఆత్మకూరు నలంద హైస్కూల్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు* నలంద హైస్కూల్ కరస్పాండెంట్ ఎం వి. చలపతి తో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్ధిన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా మన దేశ ఐక్యతను చాటే అతి పెద్ద పండుగ పంద్రాగస్టు వేడుక అని అన్నారు. మనమందరం దేశభక్తితో సరికొత్త స్ఫూర్తితో ఈ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఇఓ బి. సుమతి, జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు చందా రమణయ్య, హెడ్మాస్టర్ సందయ్య, ఉపాధ్యాయ, ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News