ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : వైఎస్సార్సీపి పార్టీ, వారి సాక్షి దినపత్రిక 108 వాహనాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కర్నూలు పట్టణంలోని, సి.క్యాంపు నందు గల 108 వాహనాల కార్యాలయం నందు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, తదితర నాయకులతో, 108 సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు మాట్లాడుతూ గత వైసీపీ హయంలో కాలం చెల్లిన 108 వాహనాలను, స్క్రాబ్ కింద నిలిచిపోయిన వాహనాలను వైఎస్సార్సీపి పార్టీ సాక్షి దినపత్రిక వాటిని చూపించి కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మండి పడ్డారు. వైఎస్సార్సీపి దుష్ప్రచారాన్ని వ్యతిరేకంగా ఖండిస్తూ కూటమి నాయకులతో మరియు 108 సిబ్బందితో కలిసి ప్లే కార్డులతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అంజి, ఇబ్రహీం, ఈశ్వర్, 108 సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News