Tuesday, 28 July 2026 10:55:41 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ప్రాణాపాయంలో ఉన్న ప్రజలను కాపాడే 108 సేవలపై నిందలు వద్దు

పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 06 January 2026 05:41 PM Views : 215

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : వైఎస్సార్సీపి పార్టీ, వారి సాక్షి దినపత్రిక 108 వాహనాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కర్నూలు పట్టణంలోని, సి.క్యాంపు నందు గల 108 వాహనాల కార్యాలయం నందు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, తదితర నాయకులతో, 108 సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు మాట్లాడుతూ గత వైసీపీ హయంలో కాలం చెల్లిన 108 వాహనాలను, స్క్రాబ్ కింద నిలిచిపోయిన వాహనాలను వైఎస్సార్సీపి పార్టీ సాక్షి దినపత్రిక వాటిని చూపించి కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మండి పడ్డారు. వైఎస్సార్సీపి దుష్ప్రచారాన్ని వ్యతిరేకంగా ఖండిస్తూ కూటమి నాయకులతో మరియు 108 సిబ్బందితో కలిసి ప్లే కార్డులతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అంజి, ఇబ్రహీం, ఈశ్వర్, 108 సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :