ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఉత్తర్వుల మేరకు, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి. అని నిరసనతో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ లో నిరసన కార్యక్రమం, రాస్తారోకో చేయటం జరిగింది. మహాత్మా గాంధీ దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, విబిజీ రామ్ జి పేరును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది ప్రధాన మంత్రి కి, మహాత్మా గాంధీ మీద దేశ ప్రజల మీద బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టిడిపి వైసిపి జనసేన లక్షలమంది ఉపాధి కూలీలకు ఈ పథకం మార్పు వల్ల నష్టం జరుగుతున్న నిమ్మకు నీరత్తకుండా ఉండటం ఏమాత్రం సరికాదని కొని ఆడరు విబిజి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. చేయకపోతే భారతదేశం మొత్తం అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం కాదు పని దినాలు 200 రోజులకు పెంచాలనీ, రోజువారి కూలి 600కు పెంచాలని డిమాండ్ చేశారు. దేశం బాగు కోసం పేద ప్రజల పట్ల పోరాడే ఏకైక నాయకుడు మన రాహుల్ గాంధీ అని, మన రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసుకున్నప్పుడే మన దేశం బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని చెప్పారు. నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధ పరిపాలన దేశ ప్రజలకు బాగా అర్థమవుతుందని, దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు తొందర్లోనే వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News