ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పట్టణంలో వికలాంగులకు వసతి గృహాన్ని మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి శ్రీధర్ రెడ్డి కి మెమోరాండం జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల. సంజీవరాయుడు మరియు అరుణ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ, జీవన్ సొసైటీ అధ్యక్షులు సుందర్ తదితరులు కలిసి ఇవ్వడం జరిగింది. నంద్యాలలో సుమారు వెయ్యి మంది వికలాంగులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారని వికలాంగులకు నంద్యాల పట్టణములో వసతి గృహం లేకపోవడం వల్ల బడి మధ్యలో మానివేస్తున్నారని కాబట్టి వసతి గృహం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. కర్నూలు పట్టణంలోనీ, సి.క్యాంపులో వికలాంగులకు వసతి గృహం ఉందని, అదేవిధంగా నంద్యాలలో కూడా మంజూరు చేసి ఏర్పాటు చేయాలని కోరారు.
Admin
E Nivas News