ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా నూతనంగా సమగ్ర శిక్షా అభియాన్, అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, రాష్ట్ర నాయకులు అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు విజయ రావు, ఉపాధ్యక్షులు జె.సి.నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ బాబు, నాయకులు శివనాగి రెడ్డి, కె.మద్దిలేటి, రఘు, సుబ్రమణ్యం, కిరణ్ బాబు, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన బడి మన భవిష్యత్తు కింద అసంపూర్తిగా వున్న పనులను పూర్తి చేయాలని, పాఠశాలకు మిగిలిన 50% కంపోసిట్ గ్రాంట్ విడుదల చేయాలని, అప్గ్రేడ్ చేసిన హై స్కూల్ లకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలనీ, క్లస్టర్ పాఠశాలల సమస్యలు దృష్టిలో ఉంచుకొని రీ ఆర్గనైజ్ చేయాలని కోరారు. ఇతర సమస్యలపై ప్రాతినిధ్యం చేసి, ఆయనతో చర్చించడం జరిగింది. ఏపీసి- నిత్యానంద రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం, మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
Admin
E Nivas News