ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్.ఎం- నిజాముద్దీన్, జిల్లా పరిషత్ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం- నిజాముద్దీన్, జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికి విజ్ఞాన బండాగారాలు అని అన్నారు. ఈ గ్రంధాలయాలలో రకరకాల పుస్తకాలు, దినపత్రికలు, వార పత్రికలు, నవలలు, చరిత్ర పుస్తకాలు ఈ విధంగా చాలా అందుబాటులో ఉంటాయన్నారు. కనుక విద్యార్థులు, గ్రామ ప్రజలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్లి పుస్తక పఠనం చేసి, తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠకులు వీరన్న, నాగిరెడ్డి , వెంకటేశ్వర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగిందని గ్రంథాలయ అధికారి సివి కృష్ణారెడ్డి తెలిపారు.
Admin
E Nivas News