ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999 -2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వంగా కలుసుకున్నారు. ముందుగా పూర్వ విద్యార్థులు బాణాసంచా కాల్చుతూ బాజా, భజంత్రీలతో పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి పాఠశాల వరకు పాదయాత్ర చేశారు. అనంతరం సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బయ్య, రంగారెడ్డి, సత్యనారాయణ ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు మక్బుల్ భాష, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, శివకుమార్, ఈశ్వరయ్య, సుదర్శనం, మహమ్మద్ ఇక్బాల్, రాజు, రవి శంకర్ శర్మ, రామకృష్ణ, నర్సింహులు, తదితరులు మాట్లాడుతూ, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో అన్న సినీ గేయం ఈ విద్యార్థులకు సరిపోతుందన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పాఠాలు చెప్పిన గురువులను, చదువుకున్న పాఠశాలను, పుట్టిన ఊరుని ఎప్పటికీ మరువరాదు అన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అన్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి భారత దేశంలోని నలుమూలల నుండి తమ మిత్రబృందాన్ని కలుసుకోవడానికి పూర్వ విద్యార్థులు తరలి వచ్చారు.మిత్ర బృందం ఒకరినొకరు పరిచయం చేసుకొని ఆనందంగా కలుసుకొని చదువుకున్న పాఠశాలలో కలియ తిరిగారు. మిత్ర బృందం తాము చదువుకున్న సమయంలో చేసిన అల్లర్లు ఉపాధ్యాయులచే తిన్న తిట్లు, దెబ్బలను గుర్తు చేసుకుంటూ ఆనంద లోకంలో మునిగిపోయారు.అనంతరం పాఠాలు నేర్పిన గురువులకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు బహుకరించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. తదుపరి మిత్ర బృందానికి మెమొంటోలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జయరామిరెడ్డి, సుల్తాన్ మొహిద్దిన్ లతోపాటు మరియు 1999- 2000 మిత్రబృందం, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News