ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలోని, అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టిడిపి నాయకుల, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్చార్జిల సమావేశంలో నియోజవర్గ అబ్జర్వర్ దేవల్ల.మురళితో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, ఏపీఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, అబ్జర్వర్ దేవెళ్ల.మురళి లు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజవర్గంలో బూతులు బలోపేతం చేయడానికి, మండల కన్వీనర్లు, అబ్జర్వర్లు, మాస్టర్ బూతు కన్వీనర్ లు, కో కన్వీనర్ లు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా నియమించబడిన నందికొట్కూరు నియోజకవర్గం 60 బూతులు బలోపేతం చేయడానికి, 13 మంది నాయకులని నియమించడం జరిగినదనీ, వారందరికీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల.రబ్బాని, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, తదితర సీనియర్ నాయకులు, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News