Tuesday, 28 July 2026 04:39:15 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఎంపీయుపీ ఉర్దూ పాఠశాలలో ఘనంగా "మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ (మెగా పీటీమ్ 4.0)

ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్. ముర్తుజాఆలి

Date : 24 July 2026 10:32 PM Views : 34

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, (ఎంపీయుపి) మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ ఉర్దూ పాఠశాల హెచ్ఎం- బద్రున్నిసా బేగం ఆధ్వర్యంలో పిల్లల బంగారు భవిష్యత్ కోసం- బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీమ్ 4.0) అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, పాఠశాల హెచ్ఎం- బద్రునిసా బేగం, విద్యా కమిటీ చైర్మన్ సుభాన్ మౌలానా, ఉపాధ్యాయులు నిజాముద్దీన్, జరీనా, తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని ఎంతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వంట ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్వయంగా తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ మొగిలిశ్వరమ్మ, ఎంపియుపి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :