ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో వివిధ మతాల పెద్దలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, ఆర్డిఓ వెంకట శివ లు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా, అన్నదమ్ముల వలె, సోదర భావంతో కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండగను నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసు వారి నిబంధనలు వినాయక మంటప నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ప్రజలు పోలీసు వారికి సహకరించాలని అందరం కలిసి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాల పెద్దలు, ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.రత్న రాధిక, రూరల్ సిఐ ఎం. సురేష్ కుమార్ రెడ్డి, అర్బన్ సిఐ మహేశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వివిధ మతాల ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News