ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూల బాటలు వేస్తోందని టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని లు అన్నారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇంటింటి అభివృద్ధి -కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం, గ్రామంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నియోజకవర్గం అబ్జర్వర్ లక్ష్మి ప్రసాద్, మండల కన్వీనర్ బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బైరాపురం గ్రామం చేరుకున్న ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి కి రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి.నాగముని, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పగుచ్చం చేతికి అందించి, ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, తదితర నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లు, టిడిపి నాయకులు సుధాకర్, ఆదినారాయణ రెడ్డి, బొగ్గుల రవికుమార్, దానమయ్య, గొల్ల కృష్ణ, వెంకటాద్రి, ఖాజామీయ, విజయుడు, రామాంజనేయులు, సర్కార్, మహిళా నాయకులు, ఓర్వకల్ మండలంలోని, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News