ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ఆమె పేరు హిఫా సలీమ్. స్వస్థలం కేరళ రాష్ట్రంలోని, త్రిసూర్ జిల్లా ఎడక్కళియూర్. ఒంటరి పోరాటం ఆ యుద్ధ నౌకలోని, 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే మహిళా మెరైన్ ఇంజనీర్. హార్మోజ్ విజేత ప్రాణాలకు తెగించి, వ్యూహాత్మక 'హార్మోజ్ జలసంధి'లో క్షిపణుల మధ్య 100 రోజుల పాటు పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చింది. గౌరవ ముద్ర నౌకలో ఆమె చూపిన ధైర్యానికి మెచ్చి తోటి సిబ్బంది అంతా ఆమెను గౌరవంగా 'పాంచ్ సాహెబ్' (ఫిఫ్త్ ఇంజనీర్) అని పిలుచుకుంటారు. ప్రస్తుతం హిఫా సలీమ్ తన తదుపరి ఉన్నత ర్యాంక్ (ఫోర్త్ ఇంజనీర్) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం,ఆదర్శం. హార్మోజ్ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే 'పాంచ్ సాహెబ్'గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. 'ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్ రంగానికి పనికిరారు' అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది. భయానికి ఎదురెళ్లి గెలిచి, భారతదేశ కీర్తిని సముద్రాల అవతలకు చాటి చెప్పిన వీరనారి హిఫా సలీం యువతకు ఆదర్శం.
Admin
E Nivas News