ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలో పూర్తి అంగవైకల్యం గల వికలాంగులకు రూ. 15వేలు పింఛన్ ఇవ్వాలని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు, జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు సూచనలతో పాములపాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా సోమవారం వికలాంగుల సమస్యలపై ఎంపీడీవో- చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందనీ తెలిపారు. లింగాల గ్రామానికి చెందిన వై.తిరుపాలు కుమార్తె వై.పవిత్ర జన్మించిన నుంచి వంద శాతం అంగవైకల్యం కలదు. ఆరోగ్య మందులకు, ఆహార పదార్థాలకు, ఇతర ఖర్చులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ 6వేలు పింఛను సరిపోవడం లేనందున్న రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని పిజిఆర్ఎస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లా.దామోదర్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ లింగాల గోపాలకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News