ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఇన్చార్జి హెచ్ఎం పి.హైమవతి సమక్షంలో వ్యాసరచన, వకృత్వ పోటీలు మరియు ఎంపీయుపి ఉర్దూ స్కూల్ లో హెచ్ఎం- బద్రున్నీసా బేగంల సమక్షంలో విద్యార్థిని, విద్యార్థులకు స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఉపాధ్యాయులు నిజాముద్దీన్, జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రవీంద్ర నాయుడు, ద్రాక్షాయిని భాయి, భారతి, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగిందని గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి తెలిపారు.
Admin
E Nivas News