Friday, 11 September 2026 08:59:41 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

జనన, మరణ నమోదుపై కేంద్రం కొత్త చట్టం- ఆలస్యమైతే కఠిన నిబంధనలు

జి.రత్న రాధిక (ఆత్మకూరు తహసిల్దార్)

Date : 21 August 2026 09:23 PM Views : 467

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఇటీవల జనన, మరణ నమోదుపై కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చారని ఆలస్యమైతే కఠిన నిబంధనలు ఉంటాయని ఆత్మకూరు తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో MRO రత్న రాధిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.రత్న రాధిక మాట్లాడుతూ ఈ విషయం విలేకరులకు తెలియజేసి, ప్రజలకు మీడియా పరంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భారత పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన జనన, మరణాల నమోదు సవరణ బిల్లు 2026 ప్రకారం జనన మరియు మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. నకిలీ సర్టిఫికెట్లను నిరోధించడం, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బి ఎన్ ఎస్ ఎస్- 2023) చట్టానికి అనుగుణంగా డేటాను సురక్షితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఘటన జరిగిన (జననం లేదా మరణం) 21 రోజులలోపు సచివాలయం, పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు అని తెలియజేశారు. 21 రోజుల నుండి 1 సంవత్సరం వరకు నిర్ణీత రుసుము (అపరాధ రుసుము) చెల్లించి స్థానిక అధికారుల వద్ద నమోదు చేసుకోవచ్చు అన్నారు. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు నిర్ణీత రుసుము చెల్లించి, ఆర్డీఓ జిల్లా అధికారుల అనుమతితో నమోదు చేయవచ్చు అని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటితే కోర్టు ఆమోదం తప్పనిసరి అన్నారు. జననం లేదా మరణం సంభవించి 2 సంవత్సరాలు దాటిన తర్వాత నమోదు చేయాలంటే ఇకపై నేరుగా మీసేవ లేదా సచివాలయాల్లో కుదరదన్నారు. స్థానిక ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉత్తర్వులు (కోర్ట్ ఆర్డర్ ) పొందడం తప్పనిసరని అన్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే సచివాలయం/మున్సిపాలిటీ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కొత్త రూల్స్ పాటించి జనన, మరణ సర్టిఫికెట్లు పొందాలని పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: