ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎస్.జిలాని బి ఆధ్వర్యంలో రెయిన్బో ఇన్స్టిట్యూట్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేస్తున్న 45 రోజుల ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణ కొరకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్టు అధ్యక్షురాలు ఎస్.జిలానీ బి మాట్లాడుతూ కుల మతాలకతీతంగా 18 సంవత్సరాల పైబడిన యువతి, యువకులు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, వారు ఏమైనా చదువుకొని ఉంటే మార్క్ లిస్టు జిరాక్స్ కాపీ తో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్డులో ఉన్న రెయిన్బో ఇన్స్టిట్యూట్ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరందరికీ 45 రోజులపాటు మహిళ ఇన్స్పెక్టర్లతో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు కేవలం 500 రూపాయలు చెల్లించి, శిక్షణ పొంది సర్టిఫికెట్స్ పొందవచ్చును. కనుక మా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు- 9030379008 నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవచ్చునన్నారు.
Admin
E Nivas News