Tuesday, 28 July 2026 11:57:58 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

విలువిద్యలో ఆత్మకూరు క్రీడాకారుణి ఆయేషా సిద్ధిఖి కి గోల్డ్ మెడల్ ప్రధానం

Date : 22 November 2025 10:21 PM Views : 594

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ దంపతుల కుమార్తె అయేషా సిద్ధిఖి విలువిద్య క్రీడాంశంలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అసోసియేషన్ సంబందించిన రాష్ట్ర, జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో పతకాలు సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుంది. అయేషా సిద్ధిఖి ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ ల కుమార్తె. వీరి కుటుంబం జీవనోపాధి నిమిత్తం మహబూబ్ నగర్లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయేషా సిద్ధిఖి, మహబూబ్ నగర్ పట్టణంలోని, ఎం.ఎస్.పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, వారణాసిలో ఈ నెల 19న ప్రారంభమై శుక్రవారం ముగిసిన 69వ ఎస్జీఎఫ్ అండర్-14 విభాగం నేషనల్ ఆర్చరీ పోటీల్లో అయేషా సిద్దిఖి బంగారు పతకం సాధించారు. ఈ పోటీల్లో దేశంలోని, 32 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా కంపౌండ్ రౌండ్లో టీమ్ విభాగంలో అయేషా సిద్దిఖీ ప్రత్యర్థులతో తలబడి బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన అయేషా సిద్ధిఖిని ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి-డాక్టర్ శారదాబాయి, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్ లు అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆత్మకూరుకు చెందిన అయేషా సిద్ధిఖి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆత్మకూరుకు చెందిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :