ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ దంపతుల కుమార్తె అయేషా సిద్ధిఖి విలువిద్య క్రీడాంశంలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అసోసియేషన్ సంబందించిన రాష్ట్ర, జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో పతకాలు సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుంది. అయేషా సిద్ధిఖి ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ ల కుమార్తె. వీరి కుటుంబం జీవనోపాధి నిమిత్తం మహబూబ్ నగర్లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయేషా సిద్ధిఖి, మహబూబ్ నగర్ పట్టణంలోని, ఎం.ఎస్.పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, వారణాసిలో ఈ నెల 19న ప్రారంభమై శుక్రవారం ముగిసిన 69వ ఎస్జీఎఫ్ అండర్-14 విభాగం నేషనల్ ఆర్చరీ పోటీల్లో అయేషా సిద్దిఖి బంగారు పతకం సాధించారు. ఈ పోటీల్లో దేశంలోని, 32 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా కంపౌండ్ రౌండ్లో టీమ్ విభాగంలో అయేషా సిద్దిఖీ ప్రత్యర్థులతో తలబడి బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన అయేషా సిద్ధిఖిని ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి-డాక్టర్ శారదాబాయి, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్ లు అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆత్మకూరుకు చెందిన అయేషా సిద్ధిఖి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆత్మకూరుకు చెందిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News