ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, దేవి ఫంక్షన్ హాల్ పాణ్యం నియోజవర్గంలోని, అన్ని మండలాల కన్వీనర్ల, క్లస్టర్ ఇంచార్జిల బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు.వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ గౌరు.వెంకట రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి కృషి, పట్టుదల పార్టీ గెలుపుకు అంకితం అని అన్నారు. మన ప్రభుత్వం కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం ఓర్వకల్లు నూతన మండల కన్వీనర్ నాగిరెడ్డి, మరియు ఇతర మండలాల కన్వీనర్లకు, క్లస్టర్ ఇంచార్డులకు, బూత్ కన్వీనర్లకు శాలువాలు కప్పి, పూలమాల మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్- పెరుగు.పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని, ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది.
Admin
E Nivas News