ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో కొత్త బోర్ పాయింట్లకు గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, ఎంపీడీవో కార్యాలయ ఏవో- ఎం.సరళ, సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, గ్రామ నాయకులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ మాట్లాడుతూ వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, గ్రామ ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా కొత్త బోర్లు వేసి, వాటికి మోటార్లు బిగించి కాలనీలకు నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్-వై.దానమయ్య, రామచంద్రనాయక్, వెంకటసుబ్బయ్య, లక్ష్మన్న నాయక్, స్వచ్ఛభారత్ ఎంసీఓ- పి.చెంచయ్య, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News