ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ విద్యాలయంలో తాజా కూరగాయలు వండి కూరలు చేయాలని, అలాగే సన్నబియ్యాన్ని సంగటి కాకుండా పొడిపొడిగా ఉండే విధంగా విద్యార్థులకు భోజనం పెట్టాలని అన్నారు. మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం వండి పెట్టాలని అన్నారు. విద్యార్థులకు అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పించాలని, విద్యాలయంలో పనిచేసే ప్రిన్సిపాల్ పర్యవేక్షణ ముఖ్యమని ఆయన అన్నారు. లేనిపక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఏవైనా లోపాలు జరిగితే ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News