ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండలంలోని, కృష్ణానగరం గ్రామానికి చెందిన మాదాసు బాలయ్య 2601/8, భజన కళాకారుడు ఆకస్మితంగా మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. భజన కళాకారులకు సహాయనిధిగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో ఆయన రూ: 100/- సభ్యత్వం కట్టి చేరినందున, మరణించిన మాదాసు బాలయ్య కుటుంబానికి జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి నుండి 5,000/- రూపాయలు జిల్లా అధ్యక్షుడు నాగేష్ నాయకత్వంలో మండల అధ్యక్షుడు భోజనం.నాగలింగం ఆధ్వర్యంలో బృందం లీడర్ ఎర్ర.శ్రీనివాస్ అందజేయడం జరిగింది. దీని ఉద్దేశం గ్రామాలలో భజన సంస్కృతి మరింత పెరగడానికి, భజన కళాకారులు భజన చేయడానికి ముందుకు వచ్చేదానికి, మన ఆధ్యాత్మిక ధర్మప్రచారం మరింత పెంచడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నామనీ, మాకు మీరంతా సహకరించాలని తిరుపతి నుండి జానపద గుర్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి కోరారు. ఈ కార్యక్రమంలో భజన సంఘం నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News