ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, బి.క్యాంప్ బీసీ భవన్ నందు కనకదాసు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాణ్యo నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు. చరిత రెడ్డి, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి. నాగముని లు బీసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి. నాగమునిలు మాట్లాడుతూ భక్త కనకదాసు కర్ణాటక రాష్ట్రంలోని, హవేరి జిల్లా, షీగ్గావ్ మండలంలోని, బాద గ్రామములో 1509లో, నవంబర్-6న తిమ్మప్ప నాయుడు-బాచమ్మ దంపతులకు జన్మించాడన్నారు. ఆయన భారతీయ తత్వవేత్త, సంగీత కళాకారుడు, ఆధునిక కవి, స్వరకర్త, గొప్ప దైవభక్తి కలవాడు అన్నారు. కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు, ఉపన్యాస బోధనల వలన బాగా ప్రాచుర్యం పొందాడన్నారు. ఈయన ఇతర హరిదాసుల మాదిరిగానే, కీర్తనల్లో కన్నడ భాషను ఉపయోగించాడన్నారు. ఈ విధంగా ఆయన జీవిత చరిత్ర గురించి కొరియాలడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News