ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు గ్రామానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ షేక్.అల్లిసా సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. ఫోటోగ్రఫీ రంగంలో అనేక సంవత్సరాలుగా సేవలందించిన ఆయన మండలంలో విశేష గుర్తింపు పొందారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఫోటో జర్నలిస్టులు, విలేకరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఫోటోగ్రఫీ రంగానికి తీరని లోటు అని అన్నారు. పాములపాడు మండలంలోని, అన్ని గ్రామాలలో జరిగిన అనేక కార్యక్రమాలు, శుభకార్యాలకు తన ఫోటోగ్రఫీ సేవలతో ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తిగా, అందరికీ సుపరిచితుడుగా, ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షేక్.అల్లిసా మృతికి నివాళులు అర్పించిన, ప్రగాఢ సానుభూతిని ఫోటో జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, గ్రామ పెద్దలు, స్నేహితులు, బంధుమిత్రులు స్థానికులు తెలియజేశారు.
Admin
E Nivas News