ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ తీసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారం దిశగా కృషి చేసేందుకు తోడ్పాటు అందించాలని ఏపీ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. మహానంది దేవస్థానంలో పాలకమండలి ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా ముష్టపల్లి గ్రామానికి చెందిన కాశీ నాయక్ కి దక్కడం యావత్ గిరిజన జాతికి అరుదైన గౌరవం దక్కిందని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మహానంది పాలకమండలి సభ్యుడుగా ఎన్నికైన శుభ సందర్భంగా జిపిఎస్ కార్యాలయ ఆవరణంలో అన్ని సంఘాల నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజు నాయక్, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను గుర్తించి దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానంలో సేవ చేసుకునేందుకు చక్కటి అవకాశం కల్పించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అదేవిధంగా మహానంది దేవస్థానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవనోపాధికి ప్రభుత్వం కల్పించాలన్నారు. అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా ఎన్నికైన కాశీ నాయక్ కి సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, ఏఐబిఎస్ఎస్ బాల నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ బాలాజీ నాయక్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు నాగ స్వామి నాయక్, హనుమంతు నాయక్, ముష్టపల్లి గ్రామ నాయకులు రామ్, నర్సయ్య, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News