ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : చెన్నైలోని, డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి తమిళనాడు నూతన సీఎం జోసెఫ్ విజయ్ మర్యాదపూర్వకంగా వెళ్లి, శాలువా కప్పి సన్మానించడం జరిగింది. వీరిరువురూ తమిళనాడుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించుకోవడం జరిగింది. రాష్ట్ర ఖజానాను గత డీఎంకే ప్రభుత్వం ఖాళీ చేసిందని ఇప్పటికే సీఎం విజయ్ ఆరోపించారు. దీనికి స్టాలిన్ కూడా బదులిచ్చారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయని, కొవిడ్-19 లాంటి విపత్తును ఎదుర్కొని ధీటుగా నిలబడ్డామని మాజీ సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. *ఎక్కేశావయ్యా విజయ్ -ఇంకో మెట్టు ఎక్కేశావ్* తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్.. వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలలో ఎవరితోనైతే తలపడ్డాడో.. సీఎం అయ్యాక అతడినే స్వయంగా వెళ్లి కలిశాడు. డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్.. ఆయనను ఆప్యాయంగా పలకరించారు. సీఎంగా తనకు సలహాలు సూచనలు కావాలని అడిగారు. స్టాలిన్ ఆశీస్సులు తీసుకున్నారు. స్టాలిన్ కూడా విజయ్ కు శాలువా కప్పి.. సత్కరించారు. ఏదిఏమైనా ఇది మంచి సాంప్రదాయం.. మాజీ ముఖ్యమంత్రిని.. ప్రస్తుత ముఖ్యమంత్రి కలవడం.. నిజంగా ఈ ఇద్దరినీ అభినందించాల్సిందే అని చర్చించుకుంటున్నారు.
Admin
E Nivas News