ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రైతులు బాగుంటే -దేశం సుభిక్షంగా ఉంటుందని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు రైతన్న - మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగాల కృష్ణారెడ్డి, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్- ఏ.షహబుద్దీన్, మండల వ్యవసాయ అధికారి కె.హేమలత తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్- ఏ.షహబుద్దీన్ రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల గురించి వివరిస్తూ, రైతులకు ప్రభుత్వ సబ్సిడీ పంట విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్ర బాబు, గ్రామ సర్పంచ్ పి.వెంకట రమణ, క్లస్టర్ ఇన్చార్జి దినకర్, పిఎసిఎస్ డైరెక్టర్ రమేశ్, గ్రామ టీడీపీ నేతలు వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రహంతుల్లా, మండల పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, ద్రోణా రెడ్డి, సురేశ్ గౌడ్, ఎంపీఈవోలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News