ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డి.ఎస్.పి- ఆర్.రామాంజి నాయక్ ఉత్తర్వుల మేరకు మరియు ఆత్మకూరు రూరల్ సీఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఆత్మకూరు శక్తీ టీం సిబ్బంది ఏఎస్ఐ- షేక్.నూర్ అహమ్మద్, ఉమెన్ హోమ్ గార్డ్ సుప్రియ లు పాములపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ధనలక్ష్మి మండల మహిళా సమాఖ్య భవనంలో హాజరైన మండలంలోని, పొదుపు సంఘాల మహిళా లీడర్ల కు మరియు అక్కడికి హాజరైన వారికి ఏపీఎం ఏ.ఉమా మహేశ్వరమ్మ ఆధ్వర్యంలో శక్తీ యాప్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఐ- షేక్.నూర్ అహమ్మద్ మాట్లాడుతూ బాలికల, మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన " శక్తి యాప్ " గురించి మరియు శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలుపుతూ, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన పోక్సో చట్టం గురించి, బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరగకుండా ఆపుటకు 1098 ఫిర్యాదు చేయవలెనని, 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని, అట్లా ఎవరయినా చేస్తునట్లయితే 112 కు గానీ, 1098 కి ఫోన్ చేసి చెప్పాలని తెలుపుతూ..ఉమన్ వెల్ఫేర్ 181, ఎమర్జెన్సీ కాల్ 112, 100 కి ఫోన్ చేయవలెనని, సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని అన్నారు. ఫేక్ కాల్స్, ఏపీకె ఫైల్స్ లాంటివి ఏదన్నా సెల్ ఫోన్ వాట్సప్ లకు ఎవరైనా లింక్ మెసేజ్లు పంపితే వాటిని ఓపెన్ చేయొద్దు అని తెలుపుతూ వాటి ద్వారా వారికీ జరిగే ఆర్థిక నష్టాలను గురించి కూడా తెలిపి, వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లలలో శక్తీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అత్యవసర సమయాలలో శక్తీ యాప్ ను ఎలా వాడాలనీ తెలియజేయడం జరిగింది. దానీ ఉపయోగాల గురించి తెలుపడమే కాకుండా శక్తీ యాప్ ను వారి సెల్ ఫోన్ లలో డౌన్లోడ్ చేయించి, ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినట్లయితే అధైర్య పడకుండా మీకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన " శక్తీ యాప్ " ను ఉపయోగించి 112 కు గానీ, 1098 కి గానీ ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చు అని అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న మైనర్ విద్యార్థులు ఎవరు కూడా మోటార్ సైకిల్ ను నడపడానికి ఇవ్వద్దని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ ఇంట్లోని వారు మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు ఖచ్చితంగా తలకు రక్షణగా " హెల్మెట్ " పెట్టుకొని ప్రయాణం చేయాలని హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి మరియు ఇతరులు లేక మీ ఇంట్లోని వారు మీ భర్త, కొడుకు, అన్నా, తమ్ముడు, మేనమామ లు ఎవ్వరైనా సరే మధ్యం త్రాగి వాహనాలను నడపవద్దని చెప్పమని సూచించారు. ఎవరైనా సరే త్రాగి వాహనం నడిపితే, పోలీసులకు చిక్కి కేసు పెడితే కోర్టు వారు 10 వేల రూపాయలు ఫైన్ లేదా జైలు శిక్ష ను విధిస్తారని తెలుపుతూ, అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి(వెలుగు) సీసీలు, బుక్ కీపర్లు, మండలంలోని పొదుపు సంఘాల మహిళలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News