Monday, 14 September 2026 03:00:02 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జరిగిన మద్దూరు సుబ్బారెడ్డి 113 జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 04 December 2025 09:15 PM Views : 288

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మాట తప్పని, మడమ తిప్పని నేత విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఏకైక రాజకీయ నాయకుడు దివంగత మాజీ నంద్యాల పార్లమెంట్ సభ్యుడు మద్దూరు సుబ్బారెడ్డి అంటూ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కొనియాడారు. అయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దాం అని అన్నారు. గురువారం నందికొట్కూరు మండలంలోని, బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ పార్లమెంటు సభ్యులు, దివంగత మద్దూరు సుబ్బారెడ్డి 113వ జయంతి మరియు పాఠాశాల 64వ వార్షికోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో పాటు మద్దూరు సుబ్బారెడ్డి మనమడు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డి లు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే చదువుల తల్లి సరస్వతీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం దివంగత మహానేత మద్దూరు సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 324 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థాపించి వాటికి పునాది వేసి శంకుస్థాపన చేశారని ఆ మహానుభావుని ద్వారా నేడు ప్రతి గ్రామంలో విద్యను అభ్యసిస్తున్నామని విద్యార్థులకు గుర్తు చేశారు. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల కోసం పాటుపడే ఏకైక వ్యక్తి మరియు ప్రజాభిమానాన్ని సంపాదించిన వ్యక్తి నిజాయితీ నిబద్ధత మారు పేరు మద్దూరు మద్దూరు సుబ్బారెడ్డిదే అన్నారు. శాసనమండలిలో ఏకగ్రీవ సభ్యుడుగా ఎన్నికైన వ్యక్తి మద్దూరు సుబ్బారెడ్డి అన్నారు. గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామ సర్పంచ్ పదవి నుంచి మండల సమితి ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ ,శాసనమండలి సభ్యుడు మరియు పార్లమెంట్ సభ్యుడుగా అంచెలంచలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో యోధుడిగా పేరు సంపాదించుకున్నారన్నారు. చదువు సంపాదిస్తే జీవితాన్ని సంపాదించవచ్చని మద్దూరు సుబ్బారెడ్డి సహకారంతో ఎంతోమంది ఉద్యోగాలు పొంది ఉన్నతమైన హెూదాలో ఉన్నారని కొనియాడారు. అనంతరం మద్దూరు సుబ్బారెడ్డి జయంతి సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరం. ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, గ్రామ సర్పంచ్ మరియమ్మ ,మాజీ ఎం పి టి సి ఖాజా మొహిద్దీన్, మాజీ సర్పంచ్ కాళీలుల్లా బేగ్, రెండో వార్డు కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, మిడుతూరు టీడీపీ మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఖలీల్ భేగ్, లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు రామిరెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పుల్లన్న, మాండ్ర.శివానందరెడ్డి పిఏ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :