ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి కి సింగపూర్ దేశం నుండి పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకురి నాగేశ్వరరావు, ఆయన తల్లి వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, నాయకులు, కార్యకర్తలతో కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. అనంతరం మాండ్రశివానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కటింగ్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి. రామసుబ్బమ్మ లు మాట్లాడుతూ మాండ్ర. శివానందరెడ్డి పోలీస్ శాఖలో సిన్సియార్టీగా విశేష సేవలు అందించి, అందరి మన్ననలు పొంది ఉన్నత స్థాయి అధికారిగా సేవ చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ ఇంచార్జిగా, మచ్చలేని నాయకుడిగా, అందరివాడిగా ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసి, అధికారంలోకి రావడానికి నిరంతరం పాటుపడడం జరిగిందన్నారు. ఆయన నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా, జిల్లా అభివృద్ధికి కూడా కృషి చేయడం జరిగిందన్నారు. భగవంతుని అపార కృపాకటాక్షాలతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అఖండ ఐశ్వర్యం, సుఖసంతోషాలు, విజయాలతో నిత్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామనీ అన్నారు. మీ నాయకత్వం, సేవాభావం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ప్రజల ఆదరణతో ప్రజాసేవలో విశిష్ట విజయాలను సాధించాలని, భగవంతుడు మీకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, నెంబర్ లక్ష్మన్న, ప్రసాద్, చిన్నస్వామి ఆచారి, టేకూరి భాస్కర్, బోనాల భాస్కర్, జీవన్న, ఆంథోనీ,జనార్ధన్ నాయక్, నారాయణ రెడ్డి, జనసేన శేషు, చిన్న హుసనయ్య, నారాయణ, సుబ్బారావు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News